Shami Plant Benefits: జమ్మీ మొక్క 15 వ్యాధులకు దివ్యౌషధం.. దీని శక్తి రామాయణంలో కూడా ప్రస్తావించారని తెలుసా?
Shami Plant Benefits: మీ చుట్టూ చాలా చెట్లు, మొక్కలు, మూలికలు ఉన్నాయి. ఇవి చిన్న నుండి పెద్ద వరకు అనేక రకాల వ్యాధులతో పోరాడగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అలాంటి ఒక మొక్క జమ్మీ. ఈ జమ్మి చెట్టును శమీ వృక్షం అని కూడా పిలుస్తారు. ఇది కోన్ ఆకారపు ముళ్ళతో సతత హరిత వృక్షం. భారతదేశంలోని పొడి ప్రాంతాలలో కనిపిస్తుంది. ccari.icar.gov నివేదికల ప్రకారం (రిఫరెన్స్).. జమ్మి చెట్టుకు వివిధ ఔషధ ఉపయోగాలు ఉన్నాయి….
Bjp Kishan Reddy:మూసీ ప్రక్షాళన చేయాల్సిందే.. నీళ్లు ఇవ్వాల్సిందే..
BJP Kishan Reddy: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేయాల్సిందే… నీళ్లు ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మీడియా చిట్ చాట్లో ఆయన మాట్లాడారు. కృష్ణా, గోదావరి నదుల నుండి నీళ్లు తీసుకువచ్చినా అభ్యంతరం లేదన్నారు. ఒక్క ఇల్లు కూలగొట్టినా ఊరుకునేది లేదని.. ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఒప్పుకోమన్నారు. మూసీ నదికి రిటైనింగ్ వాల్ కట్టాలన్నారు. సిటీలో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. సీవరేజ్ ప్లాంట్కు…
Anushka Shetty : అనుష్క శెట్టి బర్త్ డే.. పాన్ ఇండియా మూవీ ‘ఘాటి’ ఫస్ట్ లుక్ రివీల్
Anushka Shetty ‘GHAATI’ Movie: అనుష్క శెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటి’ ప్రేక్షకుల్లో మంచి బజ్ని క్రియేట్ చేసింది. అనుష్క నుండి వస్తున్న ఈ కొత్త సినిమా ఆమెకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందిస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. క్వీన్ అనుష్క శెట్టి క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడితో కలిసి ‘ఘాటి’ అనే ఉత్తేజకరమైన కొత్త ప్రాజెక్ట్ కోసం మరోసారి జతకట్టింది. యూవీ క్రియేషన్స్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి…
Sakshi Pant: రిషబ్ పంత్ సోదరిని చూశారా.. హీరోయిన్ కంటే తక్కువేమీ కాదు..
Sakshi Pant: భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ప్రస్తుతం ఐపీఎల్ మెగా వేలంతో వార్తల్లో నిలుస్తున్నాడు. పంత్ సోదరిని మీరు ఎప్పుడైనా చూశారా. రిషబ్ సోదరి సాక్షి పంత్ లుక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె రిషబ్ పంత్ కంటే 2 సంవత్సరాలు పెద్దది. స్టైల్ పరంగా ఎవరికీ తక్కువ కాదు. తన స్టైల్తో బాలీవుడ్ హీరోయిన్లకు కూడా పోటీ ఇస్తుంది. ఇప్పుడు ఆమె దేశీ లుక్ని తీసుకున్నా లేదా…
AP Cabinet: డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..
AP Cabinet Approves Drone Policy and Takes Key Decisions : డ్రోన్ పాలసీకి ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వెయ్యి కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా డ్రోన్ పాలసీ 2024-29ను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ రూపొందించింది. డ్రోన్ రంగంలో 40 వేల ఉద్యోగాల కల్పన, రూ.3 వేల కోట్ల రాబడి లక్ష్యంగా మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయించింది. కేబినెట్ నిర్ణయంతో…
Rebel Star Prabhas: రెబెల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ప్రారంభం
Rebel Star Prabhas: ప్రతిభ గల రచయితలను ప్రోత్సహించే లక్ష్యంతో రూపొందిన ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ను రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా ద్వారా లాంఛ్ చేశారు. తన సినిమాలతో వైవిధ్యమైన కథలను ప్రేక్షకులకు అందిస్తుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. ‘ది స్క్రిప్ట్ క్రాఫ్ట్’ వెబ్ సైట్ ద్వారా మరిన్ని క్రియేటివ్ స్టోరీస్, టాలెంటెడ్ రైటర్స్ ఇండస్ట్రీకి రావాలనే ప్రయత్నానికి ప్రభాస్ తన వంతు మద్ధతు అందిస్తుండటం అభినందనీయమని అభిమానులు హర్షం వ్యక్తం…
Amaran Success Meet: సాయిపల్లవి డ్యాన్స్కు నేను పెద్ద అభిమానిని.. ‘అమరన్’ సక్సెస్ మీట్ లో హీరో నితిన్
Amaran Success Meet: ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన…
Trending Love: నిహారిక చేతుల మీదుగా ‘ట్రెండింగ్లవ్’ ఫస్ట్లుక్ విడుదల
Trending Love: వర్ధన్ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీలు ముఖ్య పాత్రల్లో నటించగా వెల్నోన్ షార్ట్ఫిలిమ్ మేకర్ హరీశ్ నాగరాజు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘ట్రెండింగ్లవ్’. దొరకునా ఇటువంటి ప్రేమ ట్యాగ్లైన్. తన్వీ ప్రొడక్షన్స్, ఆర్డీజీ ప్రొడక్షన్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ చిత్రానికి సోనుగుప్తా, రూపేశ్ డి గోయల్ నిర్మాతలు. ‘ట్రెండింగ్లవ్’ చిత్రం ఫస్ట్లుక్ను ప్రముఖ నటి, నిర్మాత కొణిదెల నిహారిక చేతులమీదుగా విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ–…
PM Modi Congratulates Trump: కంగ్రాట్స్ మై ఫ్రెండ్.. ట్రంప్కు మోడీతో పాటు అభినందనల వెల్లువ
PM Modi Congratulates Donal Trump: : డొనాల్డ్ ట్రంప్ రూపంలో అమెరికాకు కొత్త అధ్యక్షుడు లభించారు. తాజా సమాచారం ప్రకారం ట్రంప్ మెజారిటీ మార్కును దాటేసి 277 సీట్లు గెలుచుకున్నారు. అదే సమయంలో ప్రస్తుత అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్కు 226 సీట్లు వచ్చాయి. అమెరికా 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్కు ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు అభినందనలు తెలిపారు డొనాల్డ్ ట్రంప్ విజయం…
PM Vidyalaxmi Scheme: విద్యార్థులకు గుడ్ న్యూస్.. పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం
PM Vidyalaxmi Scheme: ప్రతిభావంతులైన విద్యార్థులు నాణ్యమైన ఉన్నత విద్యను అభ్యసించడానికి ఆర్థిక పరిమితులు అడ్డుకాకుండా వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి-విద్యాలక్ష్మి(PM Vidyalaxmi Scheme) పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.ఈ పథకం ప్రకారం, నాణ్యమైన ఉన్నత విద్యా సంస్థలలో (QHEIs) అడ్మిషన్ కోరుకునే ఎవరైనా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి ట్యూషన్ ఫీజు, ఇతర ఖర్చుల మొత్తాన్ని కవర్ చేయడానికి పూచీకత్తు లేని,…
Allu Arjun: అల్లు అర్జున్ కు ఊరట.. కేసును కొట్టేసిన హైకోర్టు
Allu Arjun: అల్లు అర్జున్ కు హైకోర్టులో ఊరట లభించింది. అల్లు అర్జున్ పై ఉన్న కేసును ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలన సినీనటుడు అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై నేడు హైకోర్టు తీర్పు ఇచ్చింది. అల్లు అర్జున్ పై ఉన్న…
IRCTC: త్వరలో కొత్త మొబైల్ యాప్ ప్రారంభం.. ఇకపై కన్ఫర్మ్ టికెట్లు పొందడం ఈజీ..
IRCTC: వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి రైల్వేలు నిరంతరం కొత్త చర్యలు తీసుకుంటాయి. భారతీయ రైల్వే త్వరలో కొత్త మొబైల్ యాప్ను ప్రారంభించబోతోంది, ఇది వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఈ యాప్లో టికెట్ బుకింగ్, ప్లాట్ఫాం పాస్, షెడ్యూల్ మానిటరింగ్ వంటి అనేక సదుపాయాలు ఉంటాయి. ఈ యాప్ IRCTC సహకారంతో పని చేస్తుంది. వినియోగదారులు ఒకే యాప్లో అనేక ప్రయాణీకుల సేవలను పొందబోతున్నారు. లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. అనేక ఇతర అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. టైమ్స్…
Indian Army: ఇండియన్ ఆర్మీ చేతికి స్వదేశీ అస్మీ మెషీన్ పిస్టల్స్
Indian Army: తమ సైనికులను మరింత పటిష్టం చేసేందుకు భారత సైన్యం ఇప్పుడు పెద్ద అడుగు వేసింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ‘అస్మీ ‘మెషీన్ పిస్టళ్లు భారత ఆర్మీ చేతికొచ్చాయి ఆర్మీ తన నార్తర్న్ కమాండ్లో 550 ‘అస్మి’ మెషిన్ పిస్టల్లను చేర్చుకుంది. ఈ పిస్టల్ పూర్తిగా భారతదేశంలో తయారు చేయబడింది. ఇది దేశాన్ని స్వావలంబనగా మార్చడానికి ఒక ముఖ్యమైన అడుగు. ఈ పిస్టల్ను తయారు చేసే పనిని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్…
Caste Census: నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం
Caste Census: తెలంగాణలో రాష్ట్ర సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న కులగణన కార్యక్రమం బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. కులగణన సర్వే బాధ్యతలు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు అప్పగించడంతో సర్వే పూర్తయ్యేవరకు స్కూళ్లు ఒంటిపూట మాత్రమే పనిచేయనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పాఠశాలలు ఒంటి పూట మాత్రమ పని చేయనున్నాయి. ఆ తర్వాత కులగణన సర్వే కార్యక్రమం కొనసాగనుంది. ఇందులో 85 వేల మంది పాల్గొననున్నారు. అందులో…
Israel: యుద్ధం మధ్యలో రక్షణ మంత్రిని మార్చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు.. కారణం ఏంటి?
Israel: ఇజ్రాయెల్ రాజకీయాల్లో పెను కలకలం రేగింది. యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన రక్షణ మంత్రి యావ్ గాలంట్ను తొలగించారు. ఆయన స్థానంలో మాజీ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఇజ్రాయెల్ అనేక రంగాల్లో యుద్ధం చేస్తున్న సమయంలో, దాని ప్రధాన మిత్రదేశమైన అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఈ మార్పు జరిగింది. నెతన్యాహు యావ్ గాలంట్ను తొలగించడానికి ‘విశ్వాస సంక్షోభం’ కారణంగా పేర్కొన్నారు. ‘యుద్ధం మధ్య ప్రధాని,…
US President Election: ట్రంప్ విజయం భారతీయ విద్యార్థులకు, కార్మికులకు లాభదాయకమేనా?
US President Election: అమెరికా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ట్రంప్ ఎక్కువ ఎలక్టోరల్ ఓట్ల సాధించి మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. ఇదిలా ఉంట.. ప్రపంచ దేశాల దృష్టి అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలపై పడింది. ఎన్నికల ఫలితాలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే ఇందుకు ప్రధాన కారణం. ఎవరైతే అమెరికా అధ్యక్షుడవుతారో, అతను కొత్త విధానాలతో వస్తాడు, ఇది చాలా దేశాలపై ప్రభావం చూపుతుంది. అమెరికాలో జరుగుతున్న అధ్యక్ష ఎన్నికలపై భారత్ కూడా దృష్టి సారించింది. ప్రపంచంలోనే…
2024 US Elections: కౌంటింగ్ లో దూసుకెళ్తున్న ట్రంప్.. న్యూయార్క్లో కమలా హారిస్ విజయం
2024 US Elections: అమెరికా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అమెరికా ఎన్నికల్లో తొలి ఫలితాలు వెలువడే సమయానికి ట్రంప్ ముందంజలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ వెనుకబడ్డారు. వైట్ హౌస్ పాలన ఎవరికి దక్కుతుందని ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఏ అభ్యర్థి 270 ఓట్లను క్రాస్ చేస్తే వారిదే విజయం కానుంది. ట్రంప్ 188 ఎలక్టోరల్ ఓట్లు సాధించి మెజారిటీ దిశగా దూసుకెళ్తున్నారు. కమలా హారిస్ 99 ఎలక్టోరల్ ఓట్లు పొందారు. ట్రంప్…
Game Changer: ‘గేమ్ చేంజర్’ యూనివర్సల్గా అందరినీ అలరిస్తుంది: నిర్మాత దిల్రాజు
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. నవంబర్ 9న లక్నోలో ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ను ఎస్వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు దిల్రాజు, ఆదిత్య…
Rahul Gandhi: సమాజంలో కుల వివక్ష బలంగా ఉంది.. అందుకే కులగణన అవసరం
Rahul Gandhi: హైదరాబాద్లో కులగణన సంప్రదింపుల సదస్సులో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కుల వివక్షతపై ప్రధాని నరేంద్ర మోడీ ఎందుకు మాట్లాడడని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలలో ఇప్పటివరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీలు, బీసీలు పనిచేస్తున్నారని అడిగారు. ఆదివాసీలు మీడియా రంగంలో ఎంత మంది ఉన్నారని.. ఈ ప్రశ్నలను పదేపదే మోడీని అడిగితే తాను దేశాన్ని విడగొట్టినట్టు నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. కులగణన వలన దేశంలో…
Cheviti Venkanna: తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో చెవిటి వెంకన్నకు సన్మానం
Cheviti Venkanna: తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం రైతు వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్ను యువజన కాంగ్రెస్ నేతలు ఘనంగా సన్మానించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం గుమ్మడవెల్లి గ్రామంలో చెవిటి వెంకన్న యాదవ్ నివాసంలోనే మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో ఉండాలని, అలాగే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలని యువజన కాంగ్రెస్ నేతలు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. బీసీ…
Nara Brahmani: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చిన నారా బ్రాహ్మణి
Nara Brahmani: ఏపీలో ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే కూటమి గెలుపు కోసం చంద్రబాబు కుటుంబంలోని ప్రతి ఒక్కరు ప్రచారంలో పాల్గొని గెలుపు కోసం కృషి చేశారు. చంద్రబాబు, లోకేష్తో పాటుగా భువనేశ్వరి, బ్రాహ్మణి కూడా ప్రచారం చేశారనే సంగతి తెలిసిందే. ఈ ప్రచారం సమయంలో మంగళగిరిలో ఇచ్చిన హామీని తాజాగా నెరవేర్చారు మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి . ఎన్నికల సందర్భంగా తమను…
Cannabis: గంజాయి సాగు చేసిన వ్యక్తికి ఐదేళ్లు జైలు శిక్ష.. న్యాయమూర్తి సంచలన తీర్పు
Cannabis: పంటలు సాగు చేయాల్సిన చోట గంజాయి మొక్కలు సాగు చేశాడు. పంటలు సాగు చేస్తే వచ్చే దిగుబడి అమ్మకాలకు పదో పరక వస్తుందని భావించిన మాసుల గౌస్ షోద్దీన్ గంజాయి మొక్కలను సాగు చేసి అమ్మకాలు చేపడితే లక్షలు గడించాలని ఆశపడి ఎక్సైజ్ పోలీసులకు గంజాయి మొక్కలతో గౌసోద్దీన్ పట్టుబడ్డాడు. ఐదేళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగి తిరిగి చివరకు జిల్లా న్యాయమూర్తి ఇచ్చిన తీర్పుకు బోరుమన్నాడు. మంగళవారం సంగారెడ్డి జిల్లా అడిషనల్ జిల్లా న్యాయమూర్తి గౌసోద్దీన్కు…
Actress Kasturi: ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నా.. తెలుగు వారికి కస్తూరి క్షమాపణలు
Actress Kasturi: గత రెండు రోజులుగా తనకు చాలా బెదిరింపులు, దాడులు వచ్చాయని తమిళ బీజేపీ నేత, ప్రముఖ నటి కస్తూరి పేర్కొన్నారు. అవి తన సంకల్పాన్ని మరింత పెంచాయన్నారు.తాను నిజమైన జాతీయవాదినని అన్నారు. తాను ఎప్పుడూ కుల, ప్రాంతీయ భేదాలకు అతీతంగా జీవించానని పేర్కొన్నారు. తెలుగుతో ప్రత్యేక అనుబంధం ఉండడం తన అదృష్టమన్నారు. తెలుగు వారు పేరు, కీర్తి, ప్రేమను అందించారని అన్నారు. తాను వ్యక్తీకరించిన అభిప్రాయాలు కొందరిని మాత్రమేనని…. అందరినీ అనలేదన్నారు. తెలుగు కుటుంబాన్ని…
Hyderabad: బైకర్స్ అలర్ట్.. ఇకపై హెల్మెట్ మస్ట్.. చలానా ధరలు పెంపు
Hyderabad: హైదరాబాద్ మహానగరంలోని వాహనదారులకు అలర్ట్. నగరంలో ఇకపై హెల్మెట్ తప్పనిసరి అని, హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. నేటి నుంచే నిబంధనలు అమలులోకి వస్తాయన్నారు. నగరంలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు చేపడుతున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడిపితే చలానా ధర 200కి పెంచారు. రాంగ్ సైడ్, రాంగ్ రూట్లో వాహనాలు నడిపినా సీరియస్ యాక్షన్ తీసుకోనున్నారు. రాంగ్ రూట్లో వచ్చిన వారికి చలానా ధరను…
US Election: నేడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య హోరాహోరీ
US Election: అమెరికా ఎన్నికలు ఈసారి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు చాలా ఆసక్తికరంగా మారనున్నాయి. నవంబర్ 5న జరగనున్న ఎన్నికలకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలి ఉండగా రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ఇటీవలి సర్వేలో కూడా డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ల పాపులారిటీ 48 శాతం సమానంగా ఉంది. ప్రపంచం మొత్తం ఈ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ట్రంప్ గెలిస్తే అమెరికా విధానాల్లో మార్పు రావచ్చు కాబట్టి ఈ ఎన్నికల ప్రభావం…
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్ గెలుపు కోసం తులసేంద్రపురంలో పూజలు
US Elections 2024: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హారిస్ కోసం తమిళనాడులోని తులసేంద్రపురం గ్రామస్థులు పూజలు చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాతృభూమి అయిన తులసేంద్రపురం గ్రామంలో పూజలు, వేడుకల వాతావరణం నెలకొంది. వాషింగ్టన్కు 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో కమలా హారిస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం కోసం పూజలు చేస్తున్నారు. దేవాలయం వద్ద “కమల ఈ గ్రామానికి చెందిన గొప్పబిడ్డ” అంటూ…
IRCTC: నిబంధనలను మార్చిన రైల్వే శాఖ.. రైలు టిక్కెట్లను బుక్ చేసుకునే ముందు ఈ విషయాలను గుర్తుంచుకోండి..
IRCTC: రైలు టికెట్ బుకింగ్ నిబంధనలను రైల్వే శాఖ మార్చింది. ఇప్పుడు ప్రయాణికులు 60 రోజుల ముందుగానే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు ఈ వ్యవధి 120 రోజులు. బ్లాక్ మార్కెటింగ్ను అరికట్టేందుకు రైల్వే శాఖ ఈ చర్య తీసుకుంది. ఇంతకు ముందు బ్రోకర్లు ముందస్తుగా టిక్కెట్లు బుక్ చేసి, తర్వాత వాటిని ఖరీదైన ధరలకు విక్రయించేవారు. నవంబర్ 1 నుంచి నిబంధనలలో మార్పులు చేశారు. మీరు కూడా రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే, మేము…
Telangana: ధాన్యం కొనుగోళ్ల పరిశీలనకు ప్రత్యేకాధికారుల నియామకం
Telangana: రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకో ఐఏఎస్ను ప్రత్యేక అధికారి గా నియమించింది. రైతులకు ఇబ్బంది తలెత్తకుండా అన్ని జిల్లాల్లో కొనుగోళ్లు చేపట్టాలని, ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొనుగోళ్లు జరుగుతున్న తీరును పరిశీలించి,…
New Maruti Suzuki Dzire - Stylish & Fuel Efficient | కొత్త డిజైర్
2024 మారుతి సుజుకి డిజైర్ నవంబర్ 11న లాంచ్ కానుంది.అగ్రెసివ్ స్టైలింగ్ తో అప్ డేటెడ్ ఎక్ట్సీరియర్ డిజైన్2024 మారుతి సుజుకి డిజైర్ నవంబర్ 11 న లాంచ్ కానుంది, ఇది బోల్డ్, షార్ప్ లైన్స్ మరియు మరింత దూకుడు సౌందర్యానికి ప్రాధాన్యత ఇచ్చే కొత్త డిజైన్ను తీసుకువస్తుంది. ముందు భాగంలో హారిజాంటల్ క్రోమ్ స్లాట్స్ తో కూడిన పెద్ద, ప్రత్యేకమైన ఆకారంలో రేడియేటర్ గ్రిల్, డీఆర్ ఎల్ లతో అనుసంధానించబడిన ఎల్ ఈడీ హెడ్ ల్యాంప్స్,…
TGSRTC: టికెట్ చార్జీలు పెరిగాయనే ప్రచారంలో వాస్తవం లేదు..
టీజీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ ధరలను పెంచిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని.. రెగ్యులర్ సర్వీస్లకు సాధారణ చార్జీలే అమల్లో ఉన్నాయని టీజీఎస్ఆర్టీసీ సంస్థ తెలిపింది. దీపావళి తిరుగు ప్రయాణ రద్దీ నేపథ్యంలో ఏర్పాటు చేసిన స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం చార్జీలను సంస్థ సవరించిందని తెలిపింది. ప్రధాన పండుగులు, ప్రత్యేక సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతోంది. తిరుగు…

